హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అడవుల నరికివేతతోపాటు అశాస్త్రీయ సాగు విధానాలు, వాతావరణ మా ర్పులు, నిర్మాణాలు, పర్యావరణ కాలుష్యం, మైనింగ్ వంటి అంశాలతో ఎన్నో అరుదైన జీ వజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 40, భరత్లో 36 శాతం మేర అరుదైన జీవజాతులు అంతరించిపోయినట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సం యుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వీటిలో పక్షి జాతులు, చేపలు, అర్ధ్రోపొడా జీవులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.