హైదరాబాద్ : స్వయం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్తో కలిసి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 మంది దివ్యాంగ లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల విలువైన సబ్సిడీ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కిరాణం, జిరాక్స్, సెల్ ఫోన్, టెంట్ హౌస్, ఫొటో స్టూడియో తదితర రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్న వారిని ప్రోత్సహించేలా.. 60 నుంచి 70 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ప్రభుత్వం రుణాలను అందిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం ఏడీ రాజేందర్, నోడల్ ఆఫీసర్ కృష్ణ, ఎఫ్ఆర్వో పవన్ తదితరులు పాల్గొనారు.