హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో ఉచిత ఉపాధి శిక్షణకు దివ్యాంగులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అభిశ్రీ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
45 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని, అభ్యర్థులకు ఉచిత వసతి కల్పిస్తామని తెలిపింది. వివరాలకు నేరుగా హైదరాబాద్ పీర్జాదిగూడలోని ఫౌండేషన్ కార్యాలయంలో లేదా 80088 49023, 80088 61623 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.