గజ్వేల్, జూన్ 14: తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయమార్కెట్యార్డులో మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదాసు శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రైతన్నలు అద్భుతంగా పంటలు పండిస్తున్నారన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథకు నీతిఅయోగ్ చేసిన సిఫారసుల మేరకు రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఉపాధి హామీ కింద రాష్ర్టానికి రావాల్సిన రూ.1400 కోట్లు ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉపాధిహామీని అనుసంధానం చేయమంటూ ఇప్పటికి మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తనిఖీలంటూ చిన్నచిన్న కారణాలతో రైస్మిల్లులపై ఎఫ్సీఐ అధికారులతో కేంద్రం దాడులు చేయిస్తున్నదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మాదాసు శ్రీనివాస్ చిత్తశుద్ధితో, అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేశాడని, అందుకే సీఎం కేసీఆర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించారన్నారు. బాధ్యతగా పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తే ప్రతిఒక్కరికి గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కార్పొరేషన్లు చైర్మన్లు వంటేరు ప్రతాప్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్, జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, హేమలత, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, ఎలక్షన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు.