కరీంనగర్ కోర్టుచౌరస్తా, మే 23 : ఎరువుల దుకాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నేరంలో నిందితుడైన అధికారి అన్నారెడ్డి ప్రాణవేందర్రెడ్డికి నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్వివేక్ గురువారం తీర్పునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన దైవాల శ్రీనివాస్ 2013 ఆగస్టు 27న గ్రామంలో ఎరువుల దుకాణం అనుమతి కోసం కరీంనగర్లోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.
కరీంనగర్ ఏడీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అన్నారెడ్డి ప్రాణవేందర్రెడ్డి.. శ్రీనివాస్ దరఖాస్తును పైఅధికారులకు పంపి అనుమతి ఇప్పించేందుకు రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈక్రమంలో 2013 సెప్టెంబర్ 5న శ్రీనివాస్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదుచేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి వివేక్కుమార్ నిందితుడు ప్రాణవేందర్రెడ్డికి నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. ప్రస్తుతం ప్రాణవేందర్రెడ్డి గంగాధర వ్యవసాయ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్టు తెలిసింది.