హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతన సవరణ చేయడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డిలకు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాపకంటి అంజయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం అసోసియేషన్ నేతలు విద్యుత్తు సౌధలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావును కలిసి పుష్పగుచ్ఛం అందించి, కృతజ్ఞతలు చెప్పారు. సీఎండీని కలిసినవారిలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, షరీఫ్, కొరడాల వెంకటేశ్వర్లు, మహేందర్, శ్రీనివాస్, మహిళా కార్యదర్శి అనురాధ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.