ఉప్పల్, మార్చి 1: హబ్సిగూడ టీఎస్ఎస్పీడీసీఎల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న విజయసింహరెడ్డి శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న భరత్కు సంబంధించిన వేతనం బిల్లు విడుదల కోసం లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు విజయసింహరెడ్డి రూ.35 వేలు తీసుకుంటుండగా పట్టుకొని, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.