తాంసి, మార్చి 20: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి, ఉండం గ్రామాల్లో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. బుధవారం ఉండం గ్రామంలో ఆయేషా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా కరెంటు పోయింది. ముందుగా ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతుండగా మైక్ సరిగా పనిచేయలేదు. కాంగ్రెసోళ్లు కరెంట్ కట్ చేశారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా అరగంటకుపైగా కరెంట్ కట్ కావడంతో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. చివరకు జనరేటర్ల సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు.