హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలో పదేపదే ఎన్నికల నిర్వహణతో ఆర్థిక, మానవ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదని, వీటిని అరికట్టేందుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో ప్రతిసారీ ఏదో ఒకరకమైన ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, దీంతో అధికార యంత్రాంగాన్ని ఎన్నికల నిర్వహణకు కేటాయిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై పడుతున్నదని చెప్పారు.
ఖజానాపై కూడా పెను భారం పడుతున్నదని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ.3,870 కోట్లుగా అంచనాలు వేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.