హైదరాబాద్/గోదావరిఖని, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల హడావుడి ముగియగానే సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగింది. ఆ సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు సోమవా రం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి. డిప్యూటీ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో సోమవారం హైదరాబాద్లో సింగరేణి కార్మికసంఘాల సమావేశం జరిగింది.
ఈ భేటీలో కార్మిక సంఘాలు ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలనినిర్ణయించారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, ఐఎఫ్టీయూ తదితర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
39,832 మందికి ఓటు హక్కు
సింగరేణి ఎన్నికల్లో 39,832 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లి డివిజన్లో 985, మందమర్రిలో 4,876, శ్రీరాంపూర్లో 9,124, కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయ పరిధిలో 1,192, కొత్తగూడెం డివిజన్లో 2,370, మణుగూరులో 2,414, ఇల్లందులో 603 మంది, భూపాలపల్లిలో 5,350, రామగుండం-1లో 5,430, ఆర్జీ-2లో 3,479, ఆర్జీ-3లో 3,063, ఏపీఏలో 944 మంది, ఒడిశాలోని నైని బ్లాకులో ఇద్దరు కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.
సింగరేణి ఎన్నికల ప్రక్రియ ఇలా..