రామగిరి, నవంబర్ 29: రైతు సంఘం మహాసభల చివరిరోజైన మంగళవారం రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా టీ సాగర్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాద్రావు, కాసాని ఐలయ్య (కొత్తగూడెం-ఖమ్మం), మాదినేని రమేశ్ (ఖమ్మం), బుర్రి శ్రీరాములు (సూర్యాపేట)తోపాటు అన్ని జిల్లాల నుంచి కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే సారంపల్లి మల్లారెడ్డి, బొంతల చంద్రారెడ్డిని శాశ్వత ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు.