హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసన, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వినోద్కుమార్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ,అజయ్కుమార్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా నజ్మాషేక్, ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీగా కే ఉమావతి, స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీగా ఏ కొండయ్యను ఎన్నుకొన్నారు.