హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై అశోక్కుమార్, పీ నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ఇది వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎం రవీందర్ను అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కార్యక్రమంలో సంఘం నేతలు ఎం ప్రకాశ్రావు, ప్రొఫెసర్ వినయ్బాబు, తిరుపతి, పీ నారాయణమ్మ, కృష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి, భోగేశ్వర్, కనుకయ్య, రమేశ్, రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.