భద్రాద్రి కొత్తగూడెం : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న (Kothagudem) సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం(Pragathi patham) వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగాఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేసారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన సీఎం కేసీఆర్కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.