Election Commssion | రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాల ఎన్నికల, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల నియామకాన్ని చేపట్టింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్ ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ నియామకమయ్యారు. మిగతా 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు వ్యవహరించనున్నారు. రిటర్నింగ్ అధికారులుగా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొంది.