హైదరాబాద్, డిసెంబర్ 25: ప్రముఖ మొబైల్ విక్రయసంస్థ సెలెక్ట్ మొబై ల్స్..రాష్ట్రంలో మరో 8 కొత్త స్టోర్లను ఆరంభించింది. పెద్దనగరాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ సేవలను చిన్న పట్టణాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఈ స్టోర్లను ప్రారంభించినట్టు కంపెనీ చైర్మన్ వై గురు చెప్పారు. హైదరాబాద్లోని చిం తల్, మియాపూర్లతోపాటు స్టేషన్ ఘన్పూర్, తొర్రూర్, వర్ధన్నపేట్, జగిత్యాల, నేలకొండపల్లి, సూర్యాపేటలో స్టోర్లను ప్రారంభించినట్టు తెలిపారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో కంపెనీ రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 85కి చేరుకోగా, త్వరలో 100 మైలురాయికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. స్టోర్ల ప్రారంభోత్సవం సందర్భంగా మొబైళ్లపై 75 శాతం, యాక్ససరీస్పై 80 శాతం డిస్కౌంట్, క్యాష్బ్యా క్, ఎక్సేంజ్ ఆఫర్లు, ఒక్క ఈఎంఐ ఉచితం లాంటి ఆఫర్లు అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఆదివారం(డిసెంబర్ 26) వరకే అందుబాటులో ఉంటాయని తెలిపారు.