హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా విద్యుత్తుశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం అవుతున్నది. వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్న ఎస్ఎం రిజ్వీని ఇంధన శాఖ కార్యదర్శిగా నియమిస్తూనే ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
బదిలీ అయిన 8 మందిలో నలుగురిని విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకే కేటాయించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణభాస్కర్ను నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఆమ్రపాలికి హెచ్ఎండీఏలో పోస్టింగ్ ఇచ్చింది.