హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద ఓయూ పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 16న నమోదు చేసిన కేసులో ఏడో నిందితుడైన గోవా నివాసి ఎడ్విన్ న్యూన్స్కు ముందస్తు బెయిల్కు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
హైకోర్టులో అతడు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ సీహెచ్ సుమలత విచారణ జరిపారు. ఎడ్విన్పై కేసు దర్యాప్తులో ఉన్నదని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజారత్ అలీ కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.