హైదరాబాద్ : డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో భాగంగా ఎడ్విన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్కు తీసుకురానున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నారాయణ బోర్కర్ను నార్కోటిక్ పోలీసులు గత మూడు నెలల క్రితం అరెస్టు చేశారు. బోర్కర్ను విచారించగా, ఎడ్విన్ పేరు బయటపడింది. బోర్కర్ ఇచ్చిన సమాచారంతో గోవాలో ఎడ్విన్పై నార్కోటిక్ పోలీసులు నిఘా ఉంచారు. గత మూడు నెలల నుంచి పోలీసుల కళ్లుగప్పి ఎడ్విన్ తప్పించుకు తిరుగుతున్నాడు. గత 15 రోజులుగా గోవాలోనే మకాం వేసిన నార్కోటిక్ పోలీసులు.. ఎడ్విన్ కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేశారు. ఇవాళ రాత్రి వరకు అతన్ని హైదరాబాద్కు తీసుకున్నారు. ఎడ్విన్ దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.