మెదక్ : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ(Edupayala Vanadurgamma) ఆలయం వద్ద భక్తుల (Devotees)రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం మాఘ అమావాస్య రోజు మంజీర నదిలో భక్తుల పుణ్యస్నానాలు చేశారు. వనదుర్గ అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు రద్దీకి అనుగుణంగా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.