మెదక్ : మహా శివరాత్రి(Maha shivaratri) పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ అలయానికి భక్తులు పోటెత్తారు. ఏడుపాయల జాతర(Edupayala Jatara) వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం ఏడుపాయల శ్రీ వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
వారికి వేద పండితులు, పాలకమండలి సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరకు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో అన్ని వసతులు కల్పించామన్నారు.