పాపన్నపేట/మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మంజీరనదిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం వనదుర్గాభవాని మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వనదుర్గామాతకు ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.