హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యాసంస్థలను డిజిటల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దే సాఫ్ట్వేర్ అప్లికేషన్ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కోల్ పోల్ రూపొందించింది. సుమారు 40 రకాల టెక్నాలజీలను వినియోగిస్తూ ఒక విద్యాసంస్థ నిర్వహణలో ఉండే ప్రతి అంశాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లో నిర్వహించేలా సరికొత్త అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు హేమంత్ సాహల్.. అప్లికేషన్ను మొబైల్ ఫోన్లోనూ వినియోగించుకొనేలా రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 విద్యాసంస్థలను డిజిటల్ క్యాంపస్లుగా మార్చామని వెల్లడించారు. హైదరాబాద్లో మల్లారెడ్డి విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకొన్నామని వివరించారు. తమ విద్యాసంస్థల కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసేందుకు కోల్పోల్ అప్లికేషన్ను వినియోగిస్తున్నామని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ భద్రారెడ్డి తెలిపారు. డిజిటలైజేషన్ కోసం రూ.కోటి వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.