హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పాఠశాలలతోపాటు సమగ్రశిక్ష అభియాన్ కార్యకలాపాల పర్యవేక్షణకు విద్యాశాఖలో విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్కే) పేరుతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాలకు సూచించింది. ఇప్పటికే రూ.4.15 కోట్లతో వీఎస్కే ఏర్పాటుకు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆమోదిత మండలి(పీఏబీ) ఆమోదం తెలిపింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వర్క్షాప్లో వీఎస్కే ఏర్పాటుపై రాష్ర్టాల విద్యాశాఖ అధికారులకు అవగాహన కల్పించారు. వర్క్షాప్కు హాజరైన రాష్ట్ర బృందం ఢిల్లీలోని ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తున్న విద్యా సమీక్షా కేంద్రాన్ని పరిశీలించింది.
వీఎస్కే పనితీరు ఇలా..