హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఫోర్టిఫైడ్ (పోషకాలున్న) రాగిజావను అందజేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు. బడిలో కొత్తగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ఒక్కో విద్యార్థికి బ్రేక్ఫాస్ట్గా 250 మిల్లీ లీటర్ల పోర్టిఫైడ్ రాగిజావను అందజేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు ఈ జావ ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు.
ఈ నెల 20న విద్యా దినోత్సవం సందర్భంగా 150 కోట్లతో ఒక్కో విద్యార్థికి రెండు జతల యూని ఫాం, వర్క్, నోట్బుక్స్ పంపిణీ చేయనున్నట్టు మం త్రి తెలిపారు. అదేరోజున మనఊరు-మనబడి కా ర్యక్రమంలో వెయ్యి బడులను ప్రారంభించనున్న ట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 9వ తరగతి వరకు ఇం గ్లిష్ మీడియంలో బోధిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 24 లక్షల మంది ప్రభుత్వ బడుల విద్యార్థులకు 60 కోట్లతో నోటు పుస్తకాలు అందిస్తామన్నా రు. నిరుడు పాఠ్యపుస్తకాల పంపిణీకి 132కోట్లు ఖర్చు చేయగా, ఈసారి 200 కోట్లు వెచ్చించామని తెలిపారు. సెలవుల అనంతరం సోమవారం బడు లు ప్రారంభం కాగా, మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేశారు. బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు 1,46,824 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సోమవారం ఒక్కరోజే 8,381 విద్యార్థులు కొత్తగా చేరారు.