మాదాపూర్, ఆగస్టు 4: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పెద్ద ఆస్తి విద్యనే అని ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు పేర్కొన్నారు. వెలమ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని చెప్పారు. సంఘం సభ్యుల పిల్లలకు ఉచిత విద్య, వసతులను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మాదాపూర్లోని ఖానామెట్లో అఖిల భారత వెలమ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ వెలమ సంఘం కోసం హైటెక్ సిటీ సమీపంలో ఐదెకరాల భూమిని కేటాయించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త దామోదర్రావు వెలమ సంఘం భవన నిర్మాణానికి రూ.2 కోట్ల విలువైన మెటీరియల్ను అందిస్తానని ప్రకటించారు.
అనంతరం పలు జిల్లాల అధ్యక్షులను ఎమ్మెల్సీ భానుప్రసాద్ సత్కరించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి బాబూరావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రవీందర్రావు, శ్రీనివాస్రావు, ఇందిర, పలు జిల్లాల అధ్యక్షులు జగన్మోహన్రావు, భాస్కర్రావు, శ్రీనివాస్రావు, కొండల్రావు, మధుసుదన్రావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.