హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ (పోంజీ) సామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ ఆధారంగా విశాఖలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ కేసులో ఏజీఎఫ్వీఐఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు భోగి సుబ్రమణ్యం, దేవకీహరనాథ్ బాబు, ఎం సుధాకరరావు తదితరులపై ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ను ఈడీ దాఖలు చేసింది. దీంతో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఈ మనీలాండరింగ్పై విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఈడీ తాతాలికంగా అటాచ్ చేసింది.