హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు కోటాను బుధవారం ఆన్లైన్లో టీటీడీ విడుదలచేసింది. ఆయా రోజుల్లో పవిత్రోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గతనెలలో ఆగస్టు నెల రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల సమయంలో ఈ తేదీల కోటాను బ్లాక్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు thirupathibalaji. ap.gov.in వెబ్సైట్ ద్వారా రోజుకు 8 వేల చొప్పున టికెట్ల కోటాను విడుదలచేశారు.