DSC | హైదరాబాద్ : టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ఎడిట్ ఆప్షన్నిచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తుదారులు వెబ్సైట్ను సంప్రదించి తప్పులను సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు.
5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ జారీచేయగా, దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 28తో ముగిసింది. మొత్తంగా 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు https ://schooledu.telangana.gov. in వెబ్సైట్ను సంప్రదించి తప్పులుంటే సవరించుకోవచ్చు.