హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): గొలుసు కట్టు మోసాల్లో సంచలనం సృష్టించిన ‘ఆమ్వే’ ఇండియా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి/స్పెషల్ కోర్టు సోమవారం ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్నది. ఆమ్వేతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన వివి ధ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రా రంభించారు. వస్తువుల విక్రయం ముసుగులో చట్టవిరుద్ధమైన మనీ సర్యులేషన్ సీమ్ని ప్రోత్సహించి దాదాపు రూ.4 వేల కోట్ల మోసానికి తెగబడినట్టు ఆమ్వేపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆమ్వే సంస్థ కు చెందిన రూ.757.77 కోట్ల విలువైన ఆస్తులను తాతాలికంగా జప్తు చేశారు. 2020-21లో ఆ సంస్థ తమ పెట్టుబడిదారులు, మాతృ సంస్థలకు డివిడెండ్, రాయల్టీ రూపాల్లో రూ.2,859.10 కోట్లు చెల్లించింది. అయితే, 2002-03 నుంచి 2021-22 వరకు వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆమ్వే రూ. 27,562 కోట్లు ఆర్జించినట్టు ఈడీ గతంలో పేరొన్నది. 2002-20లో ఆ సంస్థ భారత్, యూఎస్ఏలోని తమ పంపిణీదారులు, సభ్యుల కు రూ.7,588 కోట్ల కమీషన్ చెల్లించినట్టు గుర్తించినట్టు వెల్లడించింది. కేసును విచారిస్తున్నామని ఈడీ తెలిపింది.