హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఛార్జ్షీట్ ఆధారంగా రేవంత్రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రేవంత్తో పాటు టీడీపీ నాయకుడు వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం కృష్ణా కీర్తన్రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్రెడ్డి పట్టుబడ్డ విషయం తెలిసిందే. 2015 మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా స్టీఫెన్సన్తో రేవంత్ రాయబారం సాగించాడు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం.
మొత్తం 4.5 కోట్ల బేరంలో మొదటగా రూ. 50 లక్షలు చెల్లించారు. ఈ కేసులో రేవంత్రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2015 మే 31న జరిపిన స్టింగ్ ఆపరేషన్లో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. ఈ కేసులో ఏపీ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే.