హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) మితంగా తింటే అమృతం, పరిమితికి మించి తింటే విషం. అయినా దేశవ్యాప్తంగా అత్యధికులు తమ ఆహారంలో పిండి పదార్థాలనే ఎక్కువగా తీసుకొంటున్నారట. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తేల్చింది. దేశ ప్రజల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన ఈ సంస్థ.. మన రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు 45 శాతానికి మించకుండా చూసుకోవాలన్నది. దీనికి మించితే ఊబకాయం, మధుమేహం తప్పదని హెచ్చరిస్తున్నది.