ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
ఇల్లందకుంట, జూలై 21: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి తప్పదని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మం డలం చిన్నకోమటిపల్లిలో బూత్ కమిటీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల మంత్రిగా ఏడేళ్లు పని చేసినా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈటల మంత్రి హోదాలో ఉండి ప్రభుత్వ పథకాలను వ్యతిరేకించాడని, తిన్నింటి వాసాలు లెక్కించే రకమని మండిపడ్డారు.