హుజూరాబాద్ టౌన్, జూలై 4 : ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశా రు. వైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, స్వరాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారని గంగుల చెప్పారు. పలు మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన ఈటల హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధిని మరిచారని.. ఇప్పుడు గెలిస్తే ఏంచేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏంచేశామని ఓట్లు అడుగుతారని ఈటల ను ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచిందని ఓట్లు అభ్యర్థిస్తారా? అని నిలదీశారు. టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసినట్టేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, బిగాల గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్గుప్తా, కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్గుప్తా, బొల్లం సంపత్, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు గర్రెపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.