East Coast Express | సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరాకు వెళ్తున్న ఈస్ట్కోస్ట్లో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ను లాగి ట్రైన్ను నిలిపివేశారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా వచ్చిన పొగలు బోగీలను కమ్మేశాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ట్రైన్ బ్రేక్ లైనర్లు పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. అయితే, ఈస్ట్కోస్ట్ రైలులో పొగలు రావడం ఇది వారంలో రెండోసారి. ఐదురోజుల కిందట మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్కు దగ్గరలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు రైలును నిలిపివేశారు. పొగలు రావడానికి ఓ ప్రయాణికుడు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ట్రైన్ చైన్ లాగి వదిలేయడంతో బ్రేకులు పట్టేశాయని, దాంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.