మర్రిగూడ, సెప్టెంబర్ 18 : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ, వార్డు సభ్యులు పుప్పాల యాదగిరి, బందెల్లి రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ పులిమామిడి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్కనగోని కొండల్ సహా పలువురు ఆదివారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. అదేవిధంగా మునుగోడులో పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు మిర్యాల మధుకర్తోపాటు సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, పద్మశాలీలు.. చండూరు మండలంలోని బోడంగిపర్తికి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడేనికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 30 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.