ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. బుధవారం జరగాల్సిన ఈ కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్టోబర్ 11,12న రెండో విడత స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు చెప్పారు.
వచ్చే నెల 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత 16వ తేదీన రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయి. ఫీజులు ఒక కొలిక్కి రాకపోవడంతోనే రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు సమాచారం.