హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం లో ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకొంటున్నారు. టీఎస్ ఎంసెట్కు దరఖాస్తులు భారీ సంఖ్యలో నమోదవుతున్నా యి. గురువారం వరకు 2,66,680 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. 10 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నది. మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్, మెడికల్, మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈసెట్కు 15,285 అప్లికేషన్లు వచ్చాయి.
మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20న పరీక్ష ఉంటుంది. ఐ సెట్కు 20,150 దరఖాస్తులు రాగా, మే 6 వరకు దరఖాస్తుకు చాన్స్ ఉన్నది. మే 26, 27న పరీక్ష నిర్వహిస్తారు. పీజీ ఈసెట్కు 3,846 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఈ నెల 30 వరకు అప్లికేషన్లకు అవకాశం ఉన్నది. మే 29 నుంచి జూన్1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎడ్ సెట్కు 8,820 దరఖాస్తులొచ్చాయి. ఈ నెల 20 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నది. మే 18న పరీక్ష జరుగనున్నది. పీఈ సెట్కు 616 దరఖాస్తులు నమోదయ్యాయి. మే 6 వరకు దరఖాస్తుకు చాన్స్ ఉన్నది. జూన్ 1 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.