హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): ఈ నెల 20న అర్చక, ఉద్యోగ, సిబ్బంది రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని సచివాలయంలో కలిసి ఆహ్వానించామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో దేవాదాయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, శ్యాంసుందర్, ఆనంద్శర్మ, నిత్యానందం, మారుతి, నగేశ్, సూర్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.