హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1న ముదిరాజ్ల అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని బీసీ దళ్ కార్యాలయంలో అలయ్బలయ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. బీసీలు ఐక్యతతో ముందుకెళ్లాలని, బీసీల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఆలయ్బలయ్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ ముదిరాజ్, కోట్ల పుష్ప ముదిరాజ్, రమేశ్ ముదిరాజ్, కురుమూర్తి, ముదిరాజ్, నరసింహ సురేష్ ముదిరాజ్, వెంకటేశ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.