హైదరాబాద్: నగర శివార్లలోని ఘట్కేసర్లో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ఘట్కేసర్ పరిధిలోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద డ్రగ్స్ (Drugs) సరఫరాచేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఉన్నది. డ్రగ్స్ను గోవా నుంచి హైదరాబాద్కు తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని సిద్దిక్, అఖిల్, రమ్యగా గుర్తించారు. వారి నుంచి 2 గ్రాముల గంజాతోపాటు మేధాంఫెటిన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్ వాడేందుకు గోవా నుంచి తెస్తున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ముగ్గురికి పరిచయమయిందని, గచ్చిబౌలిలోని ఓ పబ్లో తరచూ పార్టీలు చేసుకునేవారని చెప్పారు. అఖిల్ తరచూ గోవా వెళ్లేవాడని, అతని డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు నెరిపేవాడన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.