మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5: అధికారం అహంకారంగా మారితే ఇట్టాగే ఉంటుందేమో.. విద్యుత్తు, రవాణా, మున్సిపల్శాఖల అధికారులు తమ అధికారబలాన్ని ఉపయోగించుకుని ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న ఘటన గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడలోని మున్సిపల్, రవాణాశాఖ కార్యాలయాలకు 3 రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆర్టీఏ, మున్సిపల్ అధికారులు తమ కార్యాలయాలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మీ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్ ఉన్నందున తాము ఏమీ చేయలేమని రీచార్జి చేసుకోవాలని విద్యుత్తు అధికారులు సూచించారు. ఆగ్రహించిన ఎంవీఐ శ్రీనివాస్రెడ్డి విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట తమ సిబ్బందితో వచ్చి 5 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. తమకు విద్యుత్తు ఇవ్వలేదు కాబట్టి పత్రాలు సక్రమంగా లేని బండ్లను సీజ్ చేస్తున్నామని చెప్పారు. అటు మున్సిపల్ అధికారులు విద్యుత్తు సబ్స్టేషన్ పన్నులు కట్టలేదంటూ పాత బస్స్టాండ్లోని కరెంట్ బిల్లుల కార్యాలయాన్ని జప్తుచేసి తాళంవేశారు. ఆగ్రహించిన విద్యుత్తు సిబ్బంది పట్టణంలో గంటపాటు విద్యుత్తు సరఫరాను నిలిపే శారు. మూడుశాఖల మధ్య జరిగిన గందరగోళ ఆధిపత్యపోరులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.