హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఒకటైన డ్రోన్ టెక్నాలజీతో విప్లవాత్మకమైన ఆవిష్కరణ లు చేయాలనుకొంటున్నవారి కో సం టీహబ్లో ప్రత్యేక కార్యక్రమా న్ని నిర్వహించనున్నారు.
క్లౌడ్ కం ప్యూటింగ్ సేవలందించే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యూఎస్), ఇం టెల్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) కలిసి ఈ నెల 10న ఏడబ్ల్యూఎస్ డ్రోన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఆసక్తి ఉన్నవారు https: //bit.ly/3P62LgU లింక్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.