హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది బాధలను తగ్గించేందుకు ఆర్థికసాయంతో పాటు బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సజావుగా పంపిణీ చేసేందుకు ఈ క్రింది మార్గదర్శకాలను జారీచేసింది.
వివరాల సేకరణ, పరిశీలన, పంపిణీ తేదీల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
పాఠశాలల నుండి డేటా సేకరణ : ఏప్రిల్ 10 నుండి 15 వరకు
జిల్లా స్థాయిలో డేటా పరిశీలన : ఏప్రిల్ 16
రాష్ట్ర స్థాయిలో డేటా సంకలనం : 17 నుండి 19 వరకు
మంజూరు, ఆన్లైన్ బదిలీ : 20 నుండి 24 వరకు
బియ్యం మంజూరు, పంపిణీ : 21 నుండి 25 వరకు.