హైదరాబాద్ : డా.ఎన్ సుధాకర్ రావు లాంటి అత్యంత ప్రతిభావంతుడికి మంచి అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని సుధాకర్ రావు లాంటి అనుభవం గల వ్యక్తి సేవలు ఆరోగ్యశ్రీ కి అవసరం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ డాక్టర్ ఎన్. సుధాకర్ రావు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుధాకర్ రావు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆ పదవికే వన్నె తెచ్చారు. వారి లాంటి ప్రతిభావంతుడు పాలకుర్తి నియోజకవర్గం చెందిన వారు కావడం అభినందనీయం అన్నారు.
అనంతరం డా. సుధాకర్ రావును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయులు, ఆరోగ్య శ్రీ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.