హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మొత్తం 296 పరీక్షాకేంద్రాల్లో 1,05, 656 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు వివరించారు. ఉదయం 10 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షాకేంద్రాలకు అనుమతిస్తామని చెప్పారు. హాల్టికెట్పై ఫొటో అచ్చుకాని వారు తమ పాస్ఫొటోను, ఐడీ ప్రూఫ్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు స్మార్ట్ఫోన్లో ఎస్బీటెట్ టీఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షాకేంద్రాలను గుర్తించవచ్చని తెలిపారు.