హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రక్షణరంగ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్రెడ్డి ‘ఎమెస్కో-డాక్టర్ బీవీ పట్టాభిరాం’ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంపాదకుడు కే రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ పలువురు నిపుణులతో సంప్రదించి ఈ మేరకు నిర్ణయించింది. ఈ నెల 26న హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో నిర్వహించే పురస్కార ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ, జయా పట్టాభిరాం సమక్షం నటుడు చిరంజీవి చేతులమీదుల డాక్టర్. సతీశ్రెడ్డి ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు. సతీశ్రెడ్డి క్షిపణులు, వాటికి సంబంధించిన పరిశోధనల్లో కీలకపాత్ర పోషించారు. రక్షణ రంగ దిగుమతులను తగ్గించి ఎగుమతుల ను పెంచడం ద్వారా దేశ స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ఆయన చేసి న సేవలు మానవత్వాన్ని చాటాయి.