సింగపూర్ : నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సంప్రదాయ నృత్యంతో.. కాకతీయ సంప్రదాయ వారసత్వ కీర్తిని పెంపొందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్న పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డంను తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) సభ్యులు ఘనంగా సత్కరించారు.
తెలంగాణ సంస్కృతిని బావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న సేవలను పద్మజారెడ్డి కొనియాడారు. ఇలాంటి సన్మానాలు తనపై మరింత బాధ్యతను పెంచుతాయన్నారు.
కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు, జూలూరి సంతోష్, రోజా రమణి చకిలం, నంగునూరి వెంకట రమణ, కార్య వర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, రవి కృష్ణ విజ్జాపూర్, శశిధర్ రెడ్డి, భాస్కర్ నడికట్ల తదితరులు పాల్గొన్నారు.