హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): నిజామాబాద్కు చెందిన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్కు ఆలిండియా రేడియో నుంచి అరుదైన గౌరవం లభించింది. జనవరి 5న జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించే ‘ఆకాశవాణి సర్వభాష జాతీయ కవి సమ్మేళనానికి ఆహ్వానం అందింది. అందులో తెలుగు భాష కవిగా తన కవిత్వాన్ని చదవాలని ఆలిండియా రేడియో కోరింది.
గంగాప్రసాద్కు అవకాశం రావడంపై ఆలిండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ ఉదయశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్, సుప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డితోపాటు ఆకాశవాణిలో ఉద్యోగ విరమణ చేసిన అధికారులు తదితరులు అభినందించారు.