హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణపై యూనియన్లు ఈ నెల 15వ తేదీలోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని డీపీహెచ్ శ్రీనివాసరావు కోరారు. డీపీహెచ్ పరిధిలో మానవ వనరులను క్రమబద్ధీకరించాలని, అవసరాలకు అనుగుణంగా పోస్టులు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా డీపీహెచ్ శ్రీనివాసరావు బుధవారం వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. క్రమబద్ధీకరణ అవసరం, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంఘాలు సూచనలు, వినతులను ఈ 15వ తేదీలోగా తమ కార్యాలయంలో అందజేయాలని డీపీహెచ్ సూచించారు.